అధిష్టానం ఆదేశిస్తే మునుగోడు నుంచి పోటీ.. | contest from munugodu if highcommand send signals | Sakshi
Sakshi News home page

అధిష్టానం ఆదేశిస్తే మునుగోడు నుంచి పోటీ..

Jan 1 2018 1:56 PM | Updated on Mar 19 2019 9:15 PM

contest from munugodu if highcommand send signals - Sakshi

యాదాద్రి భువనగిరి : అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నుంచి పోటీచేస్తానని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ..నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగి రెండేళ్లు అవుతున్నా ...అతని వల్ల  లబ్ధిపొందిన వారిని అరెస్ట్ చేయలేదని విమర్శించారు. 24 గంటల కరెంటు వల్ల భూస్వాములకే లాభమన్నారు. మునుగొడు, భువనగిరి నియోజకవర్గాలలో పీసీసీ పెట్టిన ఇంచార్జిలను తాము గుర్తించటం లేదని అన్నారు. పార్టీ హైకమాండ్‌... పీసీసీ బాధ్యతలను కోమటిరెడ్డి సోదరులకు అప్పగిస్తే తెలంగాణలో పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement