టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్సీ

Congress EX MLC Narsa Reddy Joins TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. త్వరలోనే తన అనుచరులు, క్యాడర్‌ను పార్టీలో చేర్పించేందుకు స్థానికంగా భారీ ఎత్తున ఓ సమావేశాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా నర్సారెడ్డి తెలిపారు. అరికెల నర్సారెడ్డి చేరిక పట్ల హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్, ఆయనకు పార్టీ సముచిత గౌరవం కల్పిస్తుందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top