సీఏఏ : బెంగాల్‌కు 30 వేల మందిని పంపనున్న బీజేపీ | BJP to Send 30 Thousand Volunteers to West Bengal | Sakshi
Sakshi News home page

సీఏఏ : బెంగాల్‌కు 30 వేల మందిని పంపనున్న బీజేపీ

Dec 26 2019 12:56 PM | Updated on Dec 26 2019 12:59 PM

BJP to Send 30 Thousand Volunteers to West Bengal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చట్టంపై సామాన్య ప్రజలక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రానికి 30 వేల మంది వాలంటీర్లను పంపాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా నేతృత్వంలో సూత్రపాయ నిర్ణయం తీసుకుంది. ఈ వాలంటీర్లు గ్రామ గ్రామాన వెళ్లి పౌరసత్వ సవరణ చట్టంపై సామాన్య ప్రజానీకానికి అవగాహన కల్పిస్తారు. వారిలో ఉన్న సందేహాలను నివృత్తి చేసి, చట్టం గురించిన పూర్తి సమాచారంతో వారిని చైతన్యవంతులను చేస్తారు. ఈ విషయంపై రేపు (శుక్రవారం) బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మరోసారి సమావేశం కానున్నారు.

కాగా, సీఏఏ, ఎన్నార్సీలపై కొంతమంది రాజకీయ నాయకులు ఒక వర్గాన్ని రెచ్చగొట్టి రాజకీయ స్వలాభం కోసం ప్రయత్నించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలు సీఏఏ చట్టంతో భారతీయ పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేసినా ఆందోళనలు ఆగకపోవడం కూడా ఈ నిర్ణయానికి మరో కారణంగా చెప్తున్నారు. మరోవైపు బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో ఈ చర్యతో ఎన్నికల్లో లబ్ది పొందే దిశగా బీజేపీ చర్య ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది వేసవిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయిలో 18 ఎంపీ స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండిబెంగాల్‌ మంత్రికి వీసా నిరాకరించిన బంగ్లాదేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement