బాలకృష్ణ వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోంది.. | BJP MLA Vishnu Kumar Raju Slams To Balakrishna | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోంది..

Apr 20 2018 5:05 PM | Updated on Mar 29 2019 9:07 PM

BJP MLA Vishnu Kumar Raju Slams To Balakrishna - Sakshi

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు

సాక్షి, విశాఖపట్నం : వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనే భయం టీడీపీకి పట్టుకుందని బీజేపీ ఎమ్మెల్యే విష్టు కుమార్‌ రాజు అన్నారు. పుట్టిన రోజు నాడైనా చంద్రబాబు నిజాలు మాట్లాడితే బాగుంటుందని ఆయన హితవు పలికారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు ప్యాకేజీకి ఒప్పుకుంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అని ఎమ్మెల్యే మండిపడ్డారు. కొందరి డైరెక్షన్‌లో బాబు నడుస్తున్నారు..  టీడీపీ కేవలం ఫ్యామిలీ పార్టీ మాత్రమే అని బీజేపీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. 

‘బాలకృష్ణ వ్యాఖ్యలతో ఆయన తండ్రి ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోంది. ఇంట్లో ఇద్దరిని హత్య చేసి.. మాపీ చేయించిన పెద్దమనిషి బాలకృష్ణ. కుటుంబ పాలన గురించి ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ తెలుసు. ఈ రోజు సాయంత్రం(ఏఫ్రిల్‌ 20) 7 గంటల్లోగా ప్రధానికి, హిజ్రాలకు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి. బాలయ్య సినిమాల్లో స్టంట్లు, ఇంటికి వచ్చిన వాళ్లను కాలుస్తారని తెలుసు.. కానీ మిడిమిడి జ్ఞానంతో కూడా  మాట్లాడతారని ఇప్పుడే తెలిసింది’  అని విష్ణుకుమార్‌ రాజు విరుచుకుపడ్డారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఏడాదిలో విశాఖకు కచ్చితంగా రైల్వేజోన్‌ వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు విశ్వాసం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement