హెలికాప్టర్‌లో వెళ్లి నామినేషన్‌

Ahead of taking on Yeddyurappa student leader mimics his chopper - Sakshi

సాక్షి, బెంగళూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప శికారిపురకు హెలికాప్టర్‌లో వచ్చి గత గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. తానేం తక్కువ కాదంటూ వినయ్‌ రాజావత్‌ అనే స్వతంత్ర అభ్యర్థి కూడా హెలికాప్టర్‌లోనే వచ్చి నామినేషన్‌ సమర్పించారు. 25 ఏళ్ల ఈ యువకుని స్వస్థలం బెంగళూరు కాగా, హెలికాప్టర్‌లో శికారిపురకు వెళ్లి  నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. హెలికాప్టర్‌ అద్దె డబ్బులను అతని స్నేహితులు భరించడం విశేషం.

ఎద్దులబండిలో వెళ్లాలనుకున్నా : రాజావత్‌ మాట్లాడుతూ అందరి కంటే విచిత్రంగా నామినేషన్‌ పత్రాలను సమర్పించాలని తొలుత తాను తలచినట్లు చెప్పారు. ఎద్దుల బండిలో వెళితే ఎలా ఉంటుందని  ఆలోచించా ను, కానీ ఆ తర్వాత యడ్యూరప్ప లాంటి వ్యక్తిని ఎదుర్కొవాలంటే హెలి కాప్టర్‌లో వెళ్లడమే ఉత్తమమని తన స్నేహితులు సూచించినట్లు చెప్పారు. రాజావత్‌  ‘విద్యార్థి’ అనే ఒక స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top