కుప్పకూలిన ట్రైనీ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

Trainee Aircraft Crash Two Pilots Deceased At GATI In Odisha - Sakshi

భువనేశ్వర్‌: శిక్షణ విమానం‌ కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒడిశాలోని ధెన్కనల్‌ జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మృతుల్ని ట్రైనీ పైలట్‌, అతని శిక్షకుడిగా గుర్తించారు. బిరసాలలోని ప్రభుత్వ ఏవియేషన్‌ ట్రైనింగ్‌ ఇన్స్‌స్టిట్యూట్‌ (గతి)లో ఈ ప్రమాదం చోటుచేసుకుందని జిల్లా అదనపు మెజిస్ట్రేట్‌ బీకే నాయక్‌ తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఘటనపై విచారణ చేపట్టామని వెల్లడించారు. 
(చదవండి: పరీక్షల కోసం ప్రాణాలు రిస్కులో పెట్టలేం!)

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top