ట్రాన్స్జెండర్ల సంక్షేమాన్ని సాంఘిక న్యాయం, సాధికారత శాఖకు అప్పగిస్తూ కేంద్రం నిబంధనలు మార్చింది.
	న్యూఢిల్లీ: ట్రాన్స్జెండర్ల సంక్షేమాన్ని సాంఘిక న్యాయం, సాధికారత శాఖకు అప్పగిస్తూ కేంద్రం నిబంధనలు మార్చింది. వీరిపై సామాజిక వేధింపులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
	
	దీంతో వీరి కోసం కొత్త జాతీయ పాలసీని  మంత్రిత్వ శాఖ రూపొందించనుంది. ‘ట్రాన్స్జెండర్ల హక్కుల బిల్లు-2015’ ప్రకారం.. వీరిని ఇతరులు అని కాకుండా ట్రాన్స్జెండర్లు అనే పిలవాలి.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
