తెలంగాణపై ప్రాథమిక అంశాలను చర్చించాం: ఆజాద్ | We discussed primary issues on Telangana: Union minister Gulam nabi Azad | Sakshi
Sakshi News home page

తెలంగాణపై ప్రాథమిక అంశాలను చర్చించాం: ఆజాద్

Oct 11 2013 12:24 PM | Updated on Sep 1 2017 11:34 PM

తెలంగాణపై ఏర్పాటైన మంత్రుల బృందం శుక్రవారం ఉదయం తొలిసారి సమావేశమైంది. గంట పాటు జరిగిన సమావేశమనంతరం కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ వివరాలను వెల్లడించారు.

తెలంగాణపై ఏర్పాటైన మంత్రుల బృందం శుక్రవారం ఉదయం తొలిసారి సమావేశమైంది. గంట పాటు జరిగిన సమావేశమనంతరం కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ వివరాలను వెల్లడించారు. ప్రాథమిక అంశాలను మాత్రమే చర్చించినట్టు తెలిపారు. ఈ నెల 19న రెండో విడత సమావేశం కానున్నట్టు ఆజాద్ వివరించారు.
 
తాజా భేటీలో కేంద్రమంత్రులు ఆజాద్తో పాటు సుశీల్కుమార్ షిండే, వీరప్ప మొయిలీ, జైరాం రమేష్‌, నారాయణస్వామి పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో ఎ.కె.ఆంటోనీ హాజరుకాలేదు. మరో మంత్రి చిదంబరం విదేశీ పర్యటనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement