విశాఖ రైల్వే జోన్‌ను ఏం చేశారు? | Visakhapatnam Railway Zone What? | Sakshi
Sakshi News home page

విశాఖ రైల్వే జోన్‌ను ఏం చేశారు?

Mar 10 2016 3:36 AM | Updated on May 29 2018 4:26 PM

విశాఖ రైల్వే జోన్‌ను ఏం చేశారు? - Sakshi

విశాఖ రైల్వే జోన్‌ను ఏం చేశారు?

చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన విశాఖ రైల్వే జోన్‌ను ఏంచేశారని, ప్రస్తుతం దాని స్థితి ఏంటని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి రైల్వే మంత్రి సురేష్ ప్రభును ప్రశ్నించారు.

రైల్వే మంత్రికి మేకపాటి ప్రశ్న

 సాక్షి, న్యూఢిల్లీ: చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన విశాఖ రైల్వే జోన్‌ను ఏంచేశారని, ప్రస్తుతం దాని స్థితి ఏంటని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి రైల్వే మంత్రి సురేష్ ప్రభును ప్రశ్నించారు.

బుధవారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇచ్చిన అనంతరం వివిధ పార్టీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వగా ముందుగా నలుగురైదుగురు సభ్యులు మాట్లాడారు. అప్పటికే ఆలస్యం కావడంతో స్పీకర్ ఇక ఇంతటితో ముగిద్దామని ప్రకటించారు. ఈ సమయంలో నెలకొన్న గందరగోళంలోనే మేకపాటి రైల్వే మంత్రిని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement