
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ఈ పరిణామం ఆర్థిక వ్యవస్థకు మంచిదని ఆయన పేర్కొన్నారు. చిన్న నగరాల్లో భూముల ధరలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రెడాయ్ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. వ్యవ సాయ రంగం తర్వాత రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలే దేశంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తూ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.