వెండితెరపై జయ జీవితం

Vibri Media Announces Jayalalitha Biopic - Sakshi

చెన్నై: తమిళనాడు దివంగత మఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ త్వరలో రానుంది. ఎన్‌టీఆర్‌ జీవితచరిత్రను సినిమాగా నిర్మిస్తున్న విబ్రి మీడియానే ఈ చిత్రాన్ని నిర్మించనుంది. జయలలిత జన్మదినమైన ఫిబ్రవరి 24న షూటింగ్‌ ప్రారంభించి, ఫస్ట్‌లుక్‌ విడుదల చేయనున్నట్లు తెలిసింది. ‘మద్రాసపట్టణం’ అనే గొప్ప చిత్రాన్ని తీసిన ఏఎల్‌ విజయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని, తమిళం, తెలుగు, హిందీలో విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. తారాగాణాన్ని ఇంకా ఖరారుచేయకున్నా దక్షిణాది, బాలీవుడ్‌కు చెందిన నటీనటులు ఇందులో నటించే అవకాశాలున్నాయి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top