తమిళనాడు: తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్న ఆగ్రహంతో ఓ యువకుడు న్యాయమూర్తిపైనే కత్తి విసిరిన ఘటన తమిళనాడులో సోమవారం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఆ కత్తి న్యాయమూర్తికి తగలలేదు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు సమీపంలో సెంగుళం ప్రాంతానికి చెందిన బాలమురుగన్, తంగామునీశ్వరి దంపతుల మధ్య విభేదాల కారణంగా విడాకులు కోరుతూ గత ఏడాది కోర్టును ఆశ్రయించారు.
విచారణ పూర్తయిన నేపథ్యంలో న్యాయమూర్తి సుధాకర్ సోమవారం తీర్పును చదివి వినిపించారు. ఆ తర్వాత విడాకుల కేసుకు సంబంధించి భార్యకు భరణం చెల్లించాలని బాలమురుగన్ను ఆదేశించారు. ఇది విన్న బాలమురుగన్ నిరసన వ్యక్తం చేస్తూ అరిచాడు. అక్కడితో ఆగకుండా వెంట తెచ్చుకున్న కత్తిని న్యాయమూర్తిపైకి విసిరాడు.


