'అంతా అవినీతి, కుంభకోణాలమయమే' | venkaiah naidu slams congress party | Sakshi
Sakshi News home page

'అంతా అవినీతి, కుంభకోణాలమయమే'

May 10 2014 12:45 PM | Updated on Mar 18 2019 9:02 PM

'అంతా అవినీతి, కుంభకోణాలమయమే' - Sakshi

'అంతా అవినీతి, కుంభకోణాలమయమే'

నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు.

హైదరాబాద్ : నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ వ్యక్తిగత దూషణలు, నీచ రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ మోడీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వెంకయ్య ధ్వజమోత్తారు. చివరకు కాంగ్రెస్ కుల రాజకీయాలు తెర పైకి తెచ్చిందన్నారు.

300పైగా సీట్లతో ఎన్టీయే విజయం సాధిస్తుందని నమ్ముతున్నామని వెంకయ్య అన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందన్నారు. పదేళ్ల కాలంలో కాంగ్రెస్ తన వైఫల్యాలను చెప్పుకోలేని స్థితిలో ఉందన్నారు. యూఏపీ పాలన అంతా అవినీతి, కుంభకోణాలమయమేనని వెంకయ్య ఎద్దేవా చేశారు. మోడీ హవాను ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement