కోల్కతా రైల్వే స్టేషన్ సమీపంలో బాంబు పేలుడు | Two children injured in crude bomb blast, two more bombs found | Sakshi
Sakshi News home page

కోల్కతా రైల్వే స్టేషన్ సమీపంలో బాంబు పేలుడు

Jan 10 2015 8:27 PM | Updated on Sep 2 2017 7:30 PM

కోల్కతా డమ్ డమ్ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం బాంబు పేలుడు సంభవించింది.

కోల్కతా: కోల్కతా డమ్ డమ్ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. బాంబును బ్యాగ్లో దాచి అక్కడ ఉంచినట్టు భద్రతాధికారులు చెప్పారు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు బ్యాగ్ తెరవడంతో పేలినట్టు తెలిపారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టంది. రెండో రైల్వే గేటు దగ్గర ఓ బ్యాగ్లో ఉంచిన మరో రెండు బాంబులను గుర్తించారు. ఇవి పేలకుండా నిర్వీర్యం చేశారు
 

Advertisement
 
Advertisement
Advertisement