సియాచిన్ అమరులకు అంతిమ వీడ్కోలు


బెంగళూరు/చెన్నై/పుణే: సియాచిన్‌లో మంచుతుపానులో చిక్కుకుపోయి అమరులైన జవాన్లకు మంగళవారం వారి స్వస్థలాల్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. కర్ణాటకలోని పశుపతి గ్రామంలో సిపాయి మహేశ్‌కు.. తేజూరులో సుబేదార్ నగేశ్‌కు అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమిళనాడులోని వెల్లూర్‌లో హవల్దార్ ఎలుమలై ఎం, కృష్ణగిరిలో సిపాయి ఎన్ రామమూర్తి, తెనిలో హవిల్దార్ ఎస్ కుమార్, మదురైలో సిపాయ్ గణేషన్‌లకు అంత్యక్రియలు నిర్వహించారు. మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో సియాచిన్ అమరుడు సిపాయ్ సునిల్ సూర్యవంశీ (25), కేరళలోని మునోర్ ద్వీపంలో లాన్స్‌నాయక్ సుధీష్ (29) అధికార లాంఛనాలతో.. అంత్యక్రియలు జరిగాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top