- మరో ఏడుగురి బందీ
- రిమాండ్కు రామేశ్వరం,
- పుదుకోట్టై జాలర్లు
సాక్షి, చెన్నై : రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి నాగపట్నం జాలర్లపై కోడియకరైలో శ్రీలంక సేన విరుచుకుపడింది. ఓ పడవతో పాటు ఏడుగుర్ని బంధీగా పట్టుకెళ్లారు. కడలిలో రాష్ట్ర జాలర్లపై శ్రీలంక సేనల పైశాచికత్వానికి హద్దులు లేకుండా పోతోంది. కేంద్రం హెచ్చరిస్తున్నా లంక సేనలు ఏ మాత్రం తగ్గడం లేదు.
తమ చేతికి చిక్కిన జాలర్లను బందీలుగా పట్టుకెళ్తున్నారు. బుధవారం అర్ధరాత్రి రామేశ్వరం, పుదుకోట్టైలకు చెం దిన జాలర్లపై రెండు శ్రీలంక సేనల బృందాలు దాడు లు చేశాయి. తుపాకుల్ని ఎక్కుపెడుతూ వీరంగం సృష్టించి 46 మందిని బందీగా పట్టుకెళ్లారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే నాగపట్నం జాలర్లపై శ్రీలంక నావికాదళం విరుచుకు పడింది.
ఏడుగురి బందీ
నాగపట్నానికి చెందిన జాలర్లు గురువారం అర్ధరాత్రి కోడియకరై పరిసరాల్లో చేపల వేటలో నిమగ్నమయ్యారు. వలల్ని విసిరి వేటలో ఉన్న జాలర్లకు వేకువ జామున శ్రీలంక సేనల రూపంలో ప్రమాదం ఎదురైంది. వచ్చీరాగానే గాల్లో కాల్పులు జరుపుతూ శ్రీలం క సేనలు వీరంగం సృష్టించారు. అక్కడ పదుల సంఖ్య లో ఉన్న పడవలు ఒడ్డుకు తిరుగు పయనమయ్యాయి. వలల్నితెంచి పడేశారు. ఆపై వెంబడిస్తూ వస్తున్న శ్రీలంక సేనలకు దొరక్కుండా జాలర్లు ముందుకు కదిలారు. అయితే ఒక పడవ మాత్రం శ్రీలంక సేనల చేతికి చిక్కింది. ఆ పడవలోని ఏడుగురు జాలర్లపై తుపాకుల్ని ఎక్కుపెట్టి బెదిరించారు.
మిగిలిన పడవలు ఎక్కడికక్కడే ఆపేయాలని హెచ్చరించారు. అయితే పడవలు ఆగమేఘాలపై ఒడ్డుకు దూసుకెళ్లడంతో వాటిని వదలి పెట్టారు. చేతికి చిక్కిన జాలర్లను బందీగా పట్టుకెళ్లారు. నెలకొంది. వరుస దాడులు జాలర్ల సంఘాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రెకెత్తిస్తోంది. జాలర్ల విడుదలకు సీఎం జయలలిత కేంద్రానికి లేఖలు రాయడం కాదని, ఈ దాడులకు ముగింపు పలికే రీతిలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అన్ని సంఘాలు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనలకు కసరత్తులు చేస్తున్నాయి. కాగా శ్రీలంక సేనల చేతికి చిక్కిన పుదుకోట్టై, రామేశ్వరం జాలర్లను శుక్రవారం మన్నార్ కోర్టులో హాజరు పరిచారు. వారిని రిమాండ్కు తరలించారు. కేంద్రం ఒత్తిడి అనంతరం శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఇచ్చే సంకేతం మేరకు మళ్లీ కోర్టులో హాజరు పరిచి, ఆ తర్వాత వీరిని విడుదలచేసే అవకాశం ఉంది. లేకుంటే అక్కడి జైళ్లలో మగ్గాల్సిందే.
ఆగని దాడులు
Published Sat, Jun 21 2014 1:49 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- అసలు ‘రేవ్’ రచ్చ గురించి తెలుసా?
- జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
- కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
- భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
- తిరుపతి: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
- IPL 2024 Final: సన్రైజర్స్కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్
- మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- ఈ రాశివారికి ఆత్మీయుల నుంచి కీలక సమాచారం
- గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
Advertisement