టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి

Scuffle between Driver, toll plaza employees - Sakshi

హర్యానా : టోల్ ప్లాజా సిబ్బందిపై బస్సు డ్రైవర్, కండక్టర్ లు దాడికి దిగారు. గురుగ్రామ్-ఫరీదాబాద్‌ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న సిబ్బందిపై హర్యానా రోడ్ వేస్‌కు చెందిన డ్రైవర్, కండక్టర్లు దాడి చేసిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇద్దరూ కలిసి టోల్‌ప్లాజా సిబ్బందిని చితకబాదారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top