వివాహ వేడుకలో విషాదం.. ఆరుగురు మృత్యువాత | sad end in marriage event in rajasthan | Sakshi
Sakshi News home page

వివాహ వేడుకలో విషాదం.. ఆరుగురు మృత్యువాత

Oct 31 2017 9:28 PM | Updated on Oct 31 2017 9:38 PM

sad end in marriage event in rajasthan

జైపూర్‌ : ఆ వివాహ వేడుకలో అనుకోకుండా జరిగిన ఘటన పెను విషాదం మిగిల్చింది. వేడుక జరుగుతున్న ప్రాంతంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి ఆరుగురు చనిపోగా 15మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ లోని జైపూర్‌ జిల్లా ఖటోలాయి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో పెళ్లి జరుగుతుండగా పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ అకస్మాత్తుగా పేలింది. దీంతో పెళ్లికి వచ్చిన వారిలో ఆరుగురు చనిపోగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను వెంటనే జైపూర్‌లోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వసుంధరా రాజే తీవ్ర సంతాపం ప్రకటించారు. బాధితుల కుటుంబాలకు అవసరమైన సాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement