ఆ నాణేలు వద్దంటే దేశ ద్రోహం కేసే | Refusing Rs 10 coin is may sedition case | Sakshi
Sakshi News home page

ఆ నాణేలు వద్దంటే దేశ ద్రోహం కేసే

Sep 25 2016 12:58 PM | Updated on Sep 4 2017 2:58 PM

ఆ నాణేలు వద్దంటే దేశ ద్రోహం కేసే

ఆ నాణేలు వద్దంటే దేశ ద్రోహం కేసే

ఆర్బీఐ ఆమోదించిన ద్రవ్యాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన వ్యక్తులపై సెక్షన్ 124(ఏ) కింది దేశ ద్రోహం కేసు పెట్టవొచ్చని ఉత్తరప్రదేశ్ లోని పిలిబిత్ జిల్లా మేజిస్ట్రేట్ ఉత్వర్వులు ఇచ్చారు.

పిలిబిత్: ఆర్బీఐ ఆమోదించిన ద్రవ్యాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన వ్యక్తులపై సెక్షన్ 124(ఏ) కింది దేశ ద్రోహం కేసు పెట్టవొచ్చని ఉత్తరప్రదేశ్ లోని పిలిబిత్ జిల్లా మేజిస్ట్రేట్ ఉత్వర్వులు ఇచ్చారు. అసలు ఎందుకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందంటే.. పుల్కిత్ శర్మ అనే ఓ వ్యక్తి బరేలీలో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఆయన దుకాణదారుల నుంచి ఆయన పది రూపాయల నాణేలు తీసుకునే వాడుకానీ, ఆయన వద్ద నుంచి తిరిగి వాటిని తీసుకునేందుకు ఎవ్వరూ అంగీకరించేవారు కాదు.

ఈ నాణేలకు చట్టపరమితి ఎక్కువకాలం లేదని, చెల్లుబాటుకావని ఊహాగానాలు అందడంతో వాటిని ఎవరూ తీసుకోలేదు. దీంతో అతడి వద్ద గత రెండు మూడు నెలలుగా కుప్పలుగా పది రూపాయల నాణేలు మిగిలిపోయాయి. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చేరి వాట్సాప్ ద్వారా పలువురి వద్దకు వెళ్లింది. చివరకు జిల్లా వ్యాప్తంగా ఈ వార్త హల్ చల్ చేయడంతో దీనిపై జిల్లా న్యాయమూర్తి స్పందించారు. రూ.10 నాణేనికి చట్టబద్ధత ఉందని, ఆర్బీఐ ఆమోదించిన ద్రవ్యాన్ని నిరాకరిస్తే చట్టపరంగా తప్పు చేసినవారవుతారని అలాంటి వారిపై దేశద్రోహం శిక్ష నమోదు చేయవచ్చని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement