థాంక్యూ నవీన్‌...సీఎంకు ప్రధాని ఫోన్‌ | Prime Minister Phone Call To Naveen Patnaik | Sakshi
Sakshi News home page

థాంక్యూ నవీన్‌...సీఎంకు ప్రధాని ఫోన్‌

Aug 11 2018 1:30 PM | Updated on Aug 15 2018 2:37 PM

Prime Minister Phone Call To Naveen Patnaik - Sakshi

ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.

భువనేశ్వర్‌ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌లు ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు కృతజ్ఞతలు తెలియ జేశారు. శుక్రవారం ఫోన్‌ ద్వారా  ఈ ఇద్దరు నాయకులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపడం విశేషం. ఇటీవల ముగిసిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో ఈ ఇద్దరు  నాయకులు ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్థికి మద్దతుగా నిలవాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే.

జనతా దళ్‌ (యు) అభ్యర్థిని ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఆయనకు బిజూ జనతా దళ్‌ కూడా మద్దతు ఇచ్చింది. ఆయన విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ఎన్డీఏకి నేతృత్వం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జనతా దళ్‌ (యు) అధినేత నితీష్‌కుమార్‌లు బిజూ జనతా దళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌కు  కృతజ్ఞతలు తెలియజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement