మా వంతు సహాయంగా రూ. 70 లక్షలు! | UP Police Help To Family Of Bulandshahr Victim SI By Donating Rs 70 Lakh | Sakshi
Sakshi News home page

పెద్ద మనసు చాటుకున్న యూపీ పోలీసులు

Jan 19 2019 9:52 AM | Updated on Jan 19 2019 9:53 AM

UP Police Help To Family Of Bulandshahr Victim SI By Donating Rs 70 Lakh - Sakshi

భార్యతో సుబోధ్‌ కుమార్‌ (పాత చిత్రం)

యూపీలోని దాద్రిలో 52 ఏళ్ల మొహమ్మద్‌ అఖ్లాక్‌ మూక హత్య కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న సుబోధ్‌ కుమార్‌ ఈ విధ్వంసకాండలో మరణించారు.

లక్నో : బులంద్‌షహర్‌ హింసాకాండలో మృతి చెందిన ఎస్‌ఐ సుబోధ్‌ కుమార్‌ కుటుంబానికి యూపీ పోలీసులు అండగా నిలిచారు. తమ వంతు సహాయంగా 70 లక్షల రూపాయలు అందించి పెద్ద మనసు చాటుకున్నారు.  ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి ప్రశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘ సుబోధ్‌ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల రూపాయల పరిహారంతో పాటుగా.. మా వంతు సహాయంగా మరో 70 లక్షల రూపాయలు వాళ్లకు అందిస్తాం’ అని వ్యాఖ్యానించారు.

కాగా బులంద్‌షహర్‌లోని మహావ్‌ గ్రామంలోని ఓ చెరుకు తోటలో ఆవు కళేబరాన్ని కనుగొనడంతో వివాదం​మొదలైంది. ఏడుగురు ముస్లింలు ఆవును చంపారని ఆరోపిస్తూ డిసెంబర్‌ 3న ఆందోళనకారులు ఛింగ్రావతి పోలీసు అవుట్‌ పోస్ట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్సై సుబోధ్‌ కుమార్‌తో పాటు సుమిత్‌ కుమార్‌ అనే యువకుడు కూడా మృతి చెందాడు. స్థానికులను రెచ్చగొట్టి హింసాకాండకు కారణమయ్యాడని భజరంగ్‌ దల్‌ నాయకుడు యోగేష్‌ రాజ్‌ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. (ముమ్మాటికి కుట్రతోనే ‘విధ్వంసం’)

ఇక యూపీలోని దాద్రిలో 52 ఏళ్ల మొహమ్మద్‌ అఖ్లాక్‌ మూక హత్య కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న సుబోధ్‌ కుమార్‌ ఈ విధ్వంసకాండ సందర్భంగా జరిగిన కాల్పుల్లో మరణించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే 2015లో జరిగిన అఖ్లాక్‌ హత్య కేసులో స్థానిక బీజేపీ శాసన సభ్యుడితోపాటు పలువురు భజరంగ్‌ దళ్‌ నాయకులు ఈ కేసులో నిందితులుగా ఉండటం.. బులంద్‌షహర్‌ ఘటనలో కూడా భజరంగ్‌ దల్‌ నాయకుడు యోగేష్‌ రాజ్‌పై ఆరోపణలు రావడంతో యోగి సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement