నేడు పటేల్‌ విగ్రహావిష్కరణ | PM Narendra Modi to inaugurate world’s tallest statue today | Sakshi
Sakshi News home page

నేడు పటేల్‌ విగ్రహావిష్కరణ

Oct 31 2018 1:51 AM | Updated on Oct 31 2018 1:51 AM

PM Narendra Modi to inaugurate world’s tallest statue today  - Sakshi

అహ్మదాబాద్‌: ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. పటేల్‌ జయంతి సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. నర్మదా జిల్లాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ సమీపంలో ఉన్న సాధు బెట్‌లో ఈ విగ్రహాన్ని కట్టారు.

ఐక్యతకు చిహ్నంగా ఏర్పాటుచేసిన ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ‘స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ’ కంటే ఇది రెట్టింపు పొడవు. వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి సర్దార్‌ డ్యామ్‌ సహా పలు పర్వత ప్రాంతాలను సందర్శించే సౌకర్యం కల్పించారు. స్థానిక నర్మదా జిల్లాలోని గిరిజనులు సర్దార్‌ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  ప్రాజెక్టు పేరుతో సహజ వనరులను నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement