
కశ్మీర్ సరిహద్దు రక్షణపై పరిక్కర్ సమీక్ష
జమ్మూ కశ్మీర్ సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ ఓసీ) వెంబడి రక్షణమంత్రి మనోహర్ పరిక్కర్ శనివారం పర్యటించారు.
కశ్మీర్: జమ్మూ కశ్మీర్ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి రక్షణమంత్రి మనోహర్ పరిక్కర్ శనివారం పర్యటించారు. దీనిలో భాగంగా సరిహద్దుల్లో రక్షణ స్థితిగతులను మంత్రి సమీక్షించారు. రాజౌరీ-పూంచ్ సెక్టార్లో చొరబాట్లు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారాలను పరిక్కర్ ఆదేశించారు.
ఆయన వెంట ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, నార్త్ కమాండ్ లెఫ్ట్ నెంట్ జనరల్ చీఫ్ డీఎస్ హూడా తదితరులు పర్యటించారు. మంత్రి పదవిని చేపట్టిన అనంతరం పరిక్కర్ కశ్మీర్ సరిహద్దుల్లో పర్యటించడం ఇదే తొలిసారి..