పార్లమెంట్ సమావేశాలు మరోరోజు పొడిగింపు | Parliament session extended by a day | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ సమావేశాలు మరోరోజు పొడిగింపు

Sep 5 2013 5:20 PM | Updated on Sep 1 2017 10:28 PM

పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీ శనివారం వరకు పొడిగించారు.

ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు  ఈ నెల 7వ తేదీ శనివారం వరకు పొడిగించారు. సమావేశాలు ప్రారంభం నుంచి తెలంగాణ, సమైక్యాంధ్రతో పాటు వివిధ సమస్యలపై అధికార ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో గడిచిపోయింది. దాంతో అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ పరిస్థితులలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల ఆమోదానికి సమావేశాల కాలాన్ని   పొడిగించారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 5న  ప్రారంభం అయ్యాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సమావేశాలు ఆగస్టు  30వ తేదీ వరకు మాత్రమే జరగాలి. అయితే ఆందోళనతో సభల సమయం వృధా కావడంతో సమావేశాల కాలాన్ని తొలుత ఈ నెల 6వ తేదీ వరకు పొడిగించారు. పెన్షన్ ఫండ్, భూ ఆక్రమణల వంటి బిల్లులు ఆమోదించవలసి ఉన్నందున మళ్లీ రెండవ సారి మరో రోజు పొడిగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement