భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా మంగళవారం ఢిల్లీలో వామపక్షాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా మంగళవారం ఢిల్లీలో వామపక్షాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి రైతులు భారీగా తరలివచ్చిన ఈ కార్యక్రమంలో టీఎంసీ, జేడీయూ పార్టీల నేతలు, సామాజిక కార్యకర్త మేథా పాట్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ బిల్లు రైతు వ్యతిరేకమని, దీనివల్ల ఆహార సంక్షోభం ఏర్పడుతుందని పలువరు నేతలు హెచ్చరించారు. పార్లమెంటు వెలుపల రైతుల ఐక్యతే పార్లమెంటులో ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమకు పోరాడే శక్తినిస్తుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి పేర్కొన్నారు.