రాష్ట్రపతికి ప్రధాని వీడ్కోలు విందు | Narendra Modi hosts farewell dinner for Pranab Mukherjee, presents president with memento | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి ప్రధాని వీడ్కోలు విందు

Jul 23 2017 1:33 AM | Updated on Aug 15 2018 2:32 PM

రాష్ట్రపతికి ప్రధాని వీడ్కోలు విందు - Sakshi

రాష్ట్రపతికి ప్రధాని వీడ్కోలు విందు

ప్రణబ్‌ ముఖర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వీడ్కోలు విందు ఇచ్చారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయబోతున్న ప్రణబ్‌ ముఖర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వీడ్కోలు విందు ఇచ్చారు. హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రణబ్‌కు మోదీ ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా విజిటర్స్‌ పుసక్తంలో రాష్ట్రపతి సంతకం చేశారు. విందులో కాబోయే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. నేడు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఎంపీలు వీడ్కోలు పలుకుతారు.

Advertisement
 
Advertisement
Advertisement