టీఆర్ఎస్ పై సీఈసీకి ఫిర్యాదు చేయనున్న ఉత్తమ్ | N. Uttamkumar Reddy to meet CEC in delhi | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ పై సీఈసీకి ఫిర్యాదు చేయనున్న ఉత్తమ్

Apr 26 2016 10:49 AM | Updated on Oct 16 2018 8:27 PM

టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.

న్యూఢిల్లీ:
టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీమ్ జైదీని కలువనున్నారు. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీకి అనుమతి పై ఫిర్యాదు చేయనున్నారు. ఉప ఎన్నిక బ్యాలెట్ ద్వారా జరపాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఈసీని కోరనున్నారు.

మరోవైపు బుధవారం(రేపు) ఖమ్మం జిల్లాలో నిర్వహించే టీఆర్‌ఎస్ 15వ ఆవిర్భావ దినోత్సవం(ప్లీనరీ), బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని చెరుకూరి తోట సమీపంలో నిర్వహించే ప్రతినిధుల సభకు, సాయంత్రం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు అన్నీ సిద్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement