ముంబై గ్యాంగ్ రేప్ కేసు:నిందితుడు పరారీ | mumbai gang rape convict escpes | Sakshi
Sakshi News home page

ముంబై గ్యాంగ్ రేప్ కేసు:నిందితుడు పరారీ

Sep 26 2013 4:27 PM | Updated on Sep 1 2017 11:04 PM

ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును ముంబై పోలీసులు వేగవంతం చేస్తున్న తరుణంలో ఓ నిందితుడు తప్పించుకుని పరారైయ్యాడు

ముంబై: ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును ముంబై పోలీసులు వేగవంతం చేస్తున్న తరుణంలో ఓ నిందితుడు తప్పించుకుని పరారైయ్యాడు. రేప్ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న శిరాజ్ రెహ్మమాన్ ఖాన్ తప్పించుకోవడంతో ఈ అంశం పోలీసులకు ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయాన్నిప్రభుత్వ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కోర్టుకు తెలిపారు. పోలీసుల చెరనుంచి తప్పించుకున్న నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 

ఫొటో జర్నలిస్ట్ గ్యాంగ్ రేప్ కేసు నిందితుల నేరాల చిట్టా రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. వారిలో కొందరు తనపైనా అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి(19) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఫొటో జర్నలిస్ట్ రేప్ జరిగిన శక్తి మిల్స్ ప్రాంగణంలోనే తనపై వారు ఆ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపింది.   ఈ మేరకు భాండప్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ వినాయక్ దేశ్‌ముఖ్ తెలిపారు.  ‘జూలై 31న ఆమె తన స్నేహితుడితో ఓ పని మీద మహాలక్ష్మి ఏరియాకు వెళ్లింది. అక్కడ కొందరు ఫొటో జర్నలిస్ట్ కేసులో చేసినట్లుగానే వీరినీ మోసపుచ్చి.. భయపెట్టి.. శక్తి మిల్స్ ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమె స్నేహితుడిని కట్టేసి.. యువతిపై సామూహిక అత్యాచారం జరిపారు’ అని పోలీసులు చెప్పారు. దీంతో ఇప్పుడు జూలై 31 రేప్ ఘటనపైనా వారిని ప్రశ్నిస్తున్నట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement