పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీల్యాడ్స్) కింద ప్రస్తుతం ఏడాదికి ఒక్కో ఎంపీకి కేటాయిస్తున్న...
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీల్యాడ్స్) కింద ప్రస్తుతం ఏడాదికి ఒక్కో ఎంపీకి కేటాయిస్తున్న రూ. 5 కోట్ల నిధులను రూ. 25 కోట్లకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశంపై ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని గణాంకాల మంత్రి వీకే సింగ్ బుధవారం లోక్సభకు రాతపూర్వక సమాధానంలో తెలిపారు.