
దాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు
శ్రీనగర్ : కల్లోల ప్రాంతం కాశ్మీర్లో గురువారం బీజేపీ నాయకుడు అన్వర్ ఖాన్పై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. అయితే అదృష్టవశాత్తు దాడి నుంచి ఆయన తప్పించుకోగలిగారు. కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఈ దాడి జరిగింది. అన్వర్ ఖాన్ వ్యక్తిగత అంగరక్షకుడు బిలాల్ అహ్మద్కు మాత్రం గాయలైయ్యాయి. బాల్హమా ప్రాంతంలో మిలిటెంట్లు ఒక్క సారిగా అన్వర్ ఖాన్పై కాల్పులు జరిపారు. గాయపడ్డ ఆయన పర్సనల్ సెక్యురిటీ ఆఫీసర్ను ఆసుపత్రిలో చేర్చినట్టు అధికారులు తెలిపారు.