మహావిషాదం: 100 మందిపైగా మృతి | massive fire at Puttingal temple in Kerala | Sakshi
Sakshi News home page

మహావిషాదం: 100 మందిపైగా మృతి

Apr 10 2016 8:29 AM | Updated on Sep 3 2017 9:38 PM

మహావిషాదం: 100 మందిపైగా మృతి

మహావిషాదం: 100 మందిపైగా మృతి

కేరళలో మహా విషాదం చోటుచేసుంది. ఆలయ సన్నిధిలో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

కొల్లమ్: కేరళలో మహా విషాదం చోటుచేసుంది. ఆలయ సన్నిధిలో 100 మందిపైగా భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉత్సవాల్లో భాగంగా పేల్చిన బాణసంచా భక్తుల పాలిట మృత్యుపాశంగా మారింది. కోటి ఆశలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు మృత్యువాత పడడంతో విషాదం నెలకొంది.\

పరవూర్‌లో పుట్టింగళ్ దేవి ఆలయంలో ఈ తెల్లవారుజామన జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందిపైగా మృతి చెందగా, 200 మంది పైగా గాయపడ్డారు. ఎంతమంది చనిపోయారన్నది అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగి అవకాశముంది. క్షతగాత్రులను తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల ఆక్రందనలతో ఆస్పత్రి పరిసరాలు మిన్నంటాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. బాణాసంచా పేలుడు సందర్భంగా ప్రమాదవశాత్తూ నిప్పురవ్వలు ఎగిసిపడడంతో శరవేగంగా మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement