కశ్మీర్: మంచు తుఫాను కారణంగా పది మంది భారత సైనికులు మరణించడంతో కశ్మీర్కు ఆవల మంచు పర్వతాలతో కూడిన ‘సియాచిన్’ ప్రాంతం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (సముద్ర మట్టానికి ఇరవై వేల అడుగుల ఎత్తులో) యుద్ధ క్షేత్రంగా గుర్తింపు పొందిన సియాచిన్ ప్రాంతాన్ని కాపల కాసేందుకు భారత ప్రభుత్వం రోజుకు అక్షరాల మూడున్నర కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోంది. సియాచిన్లో భారత్, పాకిస్తాన్ సైనికుల మధ్య ఇంతవరకు జరిగిన సంఘర్షణ, యుద్ధాల్లో 900 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది మంచు తుఫానుల కారుణంగానే మరణించడం గమనార్హం.
2012లో సంభవించిన భారీ హిమపాతంలో పాకిస్తాన్కు చెందిన 140 మంది సైనికులు మరణించారు. అప్పుడు భారత్ అందిస్తానన్న సహాయ సహకారాలను పాకిస్తాన్ స్వీకరించలేదు. ఇప్పుడు గల్లంతయిన పది మంది భారత సైనికులను కాపాడేందుకు పాకిస్తాన్ అందిస్తానన్న సహాయాన్ని భారత్ స్వీకరించలేదు. ఇరు దేశాలు ఇలాంటి వైఖరిని అనుసరిస్తూ వస్తుండడం వల్లనే ఇంతవరకు సియాచిన్ సమస్య పరిష్కారం కాలేదు.
భారత్, పాకిస్తాన్ దేశాలు రెండుగా విడిపోయిన తర్వాత 1949లో కుదిరిన కరాచి ఒప్పందంలో ఇరుదేశాల మధ్య సియాచిన్ సరిహద్దులను నిర్దేషించలేదు. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందంలో కూడా సరిహద్దులను నిర్దేశించకుండా కేవలం కాల్పుల విరమణ హద్దులను మాత్రమే నిర్ణయించారు. మానవ నివాసానికి గానీ, మరే ఇతర అవసరాలకుగానీ ఉపయోగపడే ప్రాంతం కాకపోవడం వల్లనే ఆ ప్రాంతాన్ని అలా వదిలేశారు. తరచు దట్టమైన మంచు కురిసే సియాచిన్లో ఉష్ణోగ్రత మైనస్ 60 డిగ్రీల వరకు పడిపోతుంది. ఈ ప్రాంతం గుండా అటు పాకిస్తాన్లోకి, అక్కడి నుంచి ఇటు భారత్లోకి రావడం దాదాపు అసాధ్యం.
వేసవి కాలంలో పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు సియాచిన్ ప్రాంతం గుండా కశ్మీర్లోకి ప్రవేశిస్తున్నారన్న ఆరోపణలతో భారత సైన్యం 1984, ఏప్రిల్ 13వ తేదీన ‘మేఘదూత్ ఆపరేషన్’ పేరిట సైనిక చర్యను చేపట్టింది. ఇక అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సియాచిన్ యుద్ధం కొనసాగుతోంది. ఇరువైపుల సైనిక దళాలు దాదాపు 19,600 అడుగుల ఎత్తులో సైనిక శిబిరాలను ఏర్పాటు చేసుకొని కాపలాగాస్తున్నాయి. 2012లో హిమపాతం వల్ల 140 మంది పాక్ సైనికులు మరణించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ కయానీ సియాచిన్ ప్రాంతం నుంచి సైన్యాన్ని ఇరువైపుల ఉపసంహరించుకుందామన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇరు దేశాలకు పరస్పర విశ్వసనీయత లేకపోవడం, కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడం వల్ల ఈ ప్రతిపాదన కార్యరూపానికి దారి తీయలేదు.
అందుకు భారత్ కూడా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోంది. మన సైనికుల ప్రాణాలను కోల్పోవడమే కాకుండా రోజుకు మూడున్నర కోట్ల రూపాయలను అనవసరంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సియాచిన్ లాంటి చిన్న సరిహద్దు సహస్యలను ముందుగా పరిష్కరించుకోవడం మున్ముందు సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి దారితీయవచ్చని నేడు పది మంది భారత సైనికులు అమరులంటూ జోహార్లు అర్పించిన ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి.
సియాచిన్లో రోజుకు మూడున్నర కోట్ల ఖర్చు
Published Fri, Feb 5 2016 1:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సరెండర్ చేసినా కుర్చీ వదలరు
బైక్తో సహా బావిలో పడి రైతు మృతి
ఎన్నికల్లో కమ్యూనిస్టులే ప్రధాన భూమిక
పర్యావరణ రక్షణకు న్యాయవ్యవస్థ కృషి
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు నామినేషన్లు
రేపే నీట్
జీవాలను కాపాడుకుందాం..
వేడి క్షణాల్లో గుర్తింపు!
అద్భుతం.. ప్రాజెక్టు ఎక్స్పో
కోడ్ ఉల్లంఘిస్తే గట్టి చర్యలుండాలి!
తప్పక చదవండి
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
Advertisement