
సంబరాలు చేసుకున్న హిందుసేన
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో హిందుసేన సంబరాలు చేసుకుంది.
‘అమెరికా ఎన్నికల ఫలితాలు మాకెంతో ఆనందం కలిగించాయి. ట్రంప్ విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉంది. ఇప్పుడు అమెరికాకు భారత్ సన్నిహిత దేశమవుతుంది. తీవ్రవాదం నిర్మూలనకు భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తాయ’ని విష్ణు గుప్తా పేర్కొన్నారు. ట్రంప్ విజయం కోసం మే నెలలో హిందూసేన ప్రత్యేక ప్రార్థనలు చేసింది. జూన్ లో ట్రంప్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించింది.