తూత్తుకుడిలో విద్రోహ శక్తులు | Government should control anti-social elements | Sakshi
Sakshi News home page

తూత్తుకుడిలో విద్రోహ శక్తులు

May 31 2018 3:37 AM | Updated on May 31 2018 3:37 AM

Government should control anti-social elements - Sakshi

తూత్తుకుడి బాధితులను పరామర్శిస్తున్న రజనీ

సాక్షి ప్రతినిధి, చెన్నై: తూత్తుకుడిలో మే 22న జరిగిన విధ్వంసానికి సంఘ విద్రోహశక్తులే కారణమని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు. చెన్నై నుంచి బుధవారం ఉదయం తూత్తుకుడికి చేరుకున్న రజనీ అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు, గాయపడిన 48 మందికి రూ.10వేలు చొప్పున సాయం అందజేశారు. తర్వాత ఆయన∙మీడియాతో మాట్లాడారు.

‘జిల్లా కలెక్టర్‌ కార్యాలయంపై దాడి, అగ్ని ప్రమాదానికి కారణం సంఘ విద్రోహశక్తులే.ఉద్యమంలోకి సంఘ వ్యతిరేక శక్తులు ప్రవేశించాయనే విషయం ముందుగా తెలుసుకోవటంలో పోలీసునిఘా విఫలమైంది. సీఎంగా జయలలిత అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచివేశారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం ఆమె బాటలో సాగాలి’ అని అన్నారు. తూత్తుకుడి ఘటనపై ప్రధాని మోదీ ఇప్పటి వరకు స్పందించకపోవటంపై.. ‘మీడియా చాలా శక్తివంతమైంది. ఈ విషయం ఆయన్నే అడగండి’ అని రజనీ అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement