ప్రభుత్వ అధికారులంతా.. మళ్లీ బడికి!! | government officials back to school again | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ అధికారులంతా.. మళ్లీ బడికి!!

Jul 5 2014 12:44 PM | Updated on Oct 22 2018 6:02 PM

అవును.. ప్రభుత్వాధికారులంతా మళ్లీ స్కూళ్లకు వెళ్తున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వచ్చేవారం నుంచి దాదాపు 35 మంత్రిత్వశాఖల్లోని అధికారుల కోసం సోషల్ మీడియా గురించిన పాఠాలు చెప్పబోతోంది.

అవును.. ప్రభుత్వాధికారులంతా మళ్లీ స్కూళ్లకు వెళ్తున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వచ్చేవారం నుంచి దాదాపు 35 మంత్రిత్వశాఖల్లోని అధికారుల కోసం సోషల్ మీడియా గురించిన పాఠాలు చెప్పబోతోంది. కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ లాంటి ఉన్నతాధికారులు ఈ సెషన్లలో మాట్లాడి, సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా ఉండాలన్న విషయాలపై శిక్షణ ఇస్తారు.

సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పడంతో వెంటనే ఈ సోషల్ మీడియా శిక్షణ తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు 39 మంత్రిత్వ శాఖలు ఈ శిక్షణకు ముందుకొచ్చాయి. వీటిలో క్రీడలు, యువజన వ్యవహారాలు, మహిళా శిశు సంక్షేమం, ఆరోగ్యం, పంచాయతీరాజ్, పెట్రోలియం, రసాయనాలు ఎరువులు, తాగునీరు - పారిశుధ్యం లాంటి శాఖలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement