జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

Five Terrorists Shot Dead In Jammu kashmir - Sakshi

శ్రీనగర్‌ : భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సంఘటన జమ్మూకశ్మీర్‌లోని షోషియాన్‌ జిల్లాలోని కిలోరా గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా, శనివారం జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు సైనికాధికారులు తెలిపారు. దీంతో నిన్నటి నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య ఐదుకు చేరింది. 

ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో కిలోరా గ్రామంలో భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. అయితే ముష్కరులు కాల్పులకు దిగడంతో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి మట్టుబెట్టిన ఉగ్రవాదిని లష్కరే తోయిబాకు చెందిన ఉమర్‌మాలిక్‌గా గుర్తించారు. ఘటనాస్థలిలో ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా ఇంట్లోకి ప్రవేశించాలని చూసిన ఓ ఆగంతకున్ని బటిండిలో భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top