81కి చేరిన 'అస్సాం' మృతుల సంఖ్య | death toll rises to 81 angry adivasis retaliate | Sakshi
Sakshi News home page

81కి చేరిన 'అస్సాం' మృతుల సంఖ్య

Dec 27 2014 11:30 AM | Updated on Sep 2 2017 6:50 PM

బోడోలాండ్ మిలిటెంట్ల దాడిలో మృతుల సంఖ్య 81కు పెరిగింది.

అసోం: బోడోలాండ్ మిలిటెంట్ల దాడిలో  మృతుల సంఖ్య 81కు  పెరిగింది.  మృతుల్లో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. సోనిట్‌పూర్, కోక్రాఝర్, చిరాంగ్ జిల్లాల్లోని మారుమూల ఆదివాసీ గ్రామాలపై నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్డీఎఫ్‌బీ)కి చెందిన ఓ వర్గం మంగళవారం దాడి చేయడం తెలిసిందే. ఈ పరిస్థితులను సమీక్షించడానికి ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ అసోం వెళ్లనున్నారు.

 

గువహటి, సోనిట్‌పూర్, కోక్రాఝర్ లలో ఆర్మీ చీఫ్ పర్యటించనున్నారు. మిలిటెంట్ల దాడికి వ్యతిరేకంగా ఆందోళనలు పెరుగుతుండటంతో అదనపు బలగాలు కావాలని అస్సాం ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement