
నోట్ల రద్దు పిటిషన్పై నేడు విచారణ
నోట్ల రద్దు నిర్ణయంతో జనం పడుతున్న కష్టాలపై దాఖలైన పిటిషన్ను గురువారం హైకోర్టు విచారించనుంది.
హైదరాబాద్: నోట్ల రద్దు నిర్ణయంతో జనం పడుతున్న కష్టాలపై దాఖలైన పిటిషన్ను గురువారం హైకోర్టు విచారించనుంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ దీనిపై కౌంటర్ దాఖలు చేయనున్నాయి. సర్కారు తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ వాదనలు వినిపించనున్నారు.