వచ్చే మంగళవారం మళ్లీ రూ.3,100 కోట్ల అప్పు | Chandrababu Naidu government to borrow through securities auction | Sakshi
Sakshi News home page

వచ్చే మంగళవారం మళ్లీ రూ.3,100 కోట్ల అప్పు

Feb 21 2026 4:21 AM | Updated on Feb 21 2026 4:21 AM

Chandrababu Naidu government to borrow through securities auction

సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు తీసుకోనున్న చంద్రబాబు సర్కారు 

నోటిఫై చేసిన ఆర్‌బీఐ

ఈ నెలలో అప్పు చేయడం ఇది మూడోసారి 

సాక్షి, అమరావతి: వచ్చే మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అప్పు చేయనుంది. రాష్ట్ర ప్ర­భు­త్వ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3,100 కో­ట్లు అప్పు తీసుకోనుంది. 16 సంవత్సరాల కాల వ్యవధితో రూ.­1,600 కోట్లు, 21 సంవత్సరాల కాల వ్యవధితో రూ.1,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయనున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. 

ఈ నెల 3వ తేదీనే చంద్రబాబు సర్కారు రూ.3,300 కోట్లు అప్పు చేసింది. అలాగే, ఈ నెల 17న మరో రూ.500 కోట్లు అప్పు చేసింది. మళ్లీ వచ్చే మంగళవారం చేసే అప్పుతో కలిపి ఈ నెలలోనే చంద్రబాబు సర్కారు బడ్జెట్‌ పరిధిలో రూ.6,900 కోట్లు అప్పు చేసినట్లు అవుతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement