టీకా కోసం ముమ్మర కృషి | Coronavirus Vaccine clinical trials in october | Sakshi
Sakshi News home page

టీకా కోసం ముమ్మర కృషి

May 29 2020 5:28 AM | Updated on May 29 2020 5:28 AM

Coronavirus Vaccine clinical trials in october - Sakshi

న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ను అడ్డుకునే టీకాను రూపొందించే పరిశోధనల్లో భారత్‌లో దాదాపు 30 బృందాలు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ విజయరాఘవన్‌ చెప్పారు. భారీ పరిశ్రమలు, సంస్థలు, సైంటిస్ట్‌లు వేర్వేరుగా పరిశోధనలు నిర్వహిస్తున్నారన్నారు. వీటిలో సుమారు 20 పరిశోధనలు మంచి పురోగతి సాధించాయన్నారు. అవి అక్టోబర్‌ నాటికి క్లినికల్‌ ట్రయల్స్‌ స్థాయికి చేరే చాన్సుంది. టీకాను రూపొందించేందుకు సాధారణంగా కనీసం పదేళ్ల సమయం పడుతుందని, దాదాపు 30 కోట్ల డాలర్ల ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రపంచమంతా ఇప్పుడు వ్యాక్సిన్‌ రూపకల్పనలో నిమగ్నమయిందని, సంవత్సరంలోపు టీకాను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement