ఉమ్మడిగానే ఎంసెట్: నరసింహన్ | Common EAMCET exam for Telangana and Andhra Pradesh, says Narasimhan | Sakshi
Sakshi News home page

ఉమ్మడిగానే ఎంసెట్: నరసింహన్

Dec 12 2014 1:06 PM | Updated on Aug 18 2018 9:18 PM

ఉమ్మడిగానే ఎంసెట్: నరసింహన్ - Sakshi

ఉమ్మడిగానే ఎంసెట్: నరసింహన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది.

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల శాంతిభద్రతలు..అధికారుల విభజన..తదితర అంశాలపై చర్చ జరిగిట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఎలాంటి సమస్యలు లేవని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగా పని చేస్తున్నారన్నారు.

రెండు రాష్ట్రాల్లోనూ శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉన్నట్లు గవర్నర్ చెప్పారు. అధికారుల విభజన త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు వేర్వేరుగా నిర్వహించుకోవచ్చని అయితే ఎంసెట్ మాత్రం ఉమ్మడిగా ఉంటుందని చెప్పారు. విద్యార్ధుల ఉమ్మడి ప్రయోజనాలను కాపాడతామని నరసింహన్ అన్నారు. రొటీన్లో భాగంగానే మోదీని కలిసినట్లు గవర్నర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement