ఆ ముఖ్యమంత్రిని ఆడేసుకుంటున్న నెటిజన్లు | CM Biplab Dev Is Going Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఆ ముఖ్యమంత్రిని ఆడేసుకుంటున్న నెటిజన్లు

Apr 30 2018 5:29 PM | Updated on Apr 30 2018 6:34 PM

CM Biplab Dev Is Going Viral On Social Media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రాకులాడకుండా ఆవులను పెంచుకోండి, పాన్‌ షాపులు పెట్టుకోండంటూ హాస్యస్పద వ్యాఖ్యలు చేసిన త్రిపుర సీఎం విప్లవ్‌ దేవ్‌ సోషల్‌ మీడియోలో విపరితంగా జోకులు పేలుతున్నాయి. అలాగే సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివిన వారే సివిల్స్‌ రాయలని, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివిన వారు రాయకుడదంటూ చేసిన వ్యాఖ్యలపై అయితే ఇంక ఎక్కువగా జోకులు పేలుతున్నాయి. టైగర్‌ బిస్కెట్లను కేవలం టైగర్స్‌ మాత్రమే తినాలని, గేట్‌ ఎగ్జామ్‌ను కేవలం గేట్‌ కిపర్స్‌ మాత్రమే రాయాలంటూ ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ ఫొటోలు పెట్టి ఆయనను తెగ ఆడేసుకుంటున్నారు.

రాజకీయ నాయకులు, సెలబ్రెటిలు పప్పులో కాలేసి మాట్లాడిన మాటలే సామాజికి మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ఎవర్ని వదిలిపెట్టట్లేదు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ చేసిన ‘బీకాంలో ఫిజిక్స్‌’ వ్యాఖ్యలు అప్పట్లో బాగా వైరల్‌ అయ్యాయి. దాంతో ఆయనకు ఎక్కడలేని పబ్లిసిటీ వచ్చేసింది. ఇప్పుడు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ని కూడా నెటిజన్లు తెగ ఆడేసుకుంటున్నారు. ఆయన గతంలో ఇంటర్నెట్‌ మహాభారత కాలంలోనే ఉందని అన్నారు. ఇలాంటి హాస్యస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement