
ప్రధానితో కశ్మీర్ సీఎం భేటీ
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు.
ఇటీవల తనను కలిసిన జమ్మూకశ్మీర్ ప్రతిపక్షాల బృందం నిర్మాణాత్మకమైన సలహాలిచ్చిందని ప్రధాని కితాబిచ్చారు. కశ్మీర్ అల్లర్లకు పాకిస్తాన్ ప్రేరేపిస్తుందని మెహబూబా ముఫ్తీ అన్నారు. కశ్మీర్ పరిస్థితులను సమీక్షించడానికి కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ ఇటీవల రెండు రోజుల పాటు శ్రీనగర్లో పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. అల్లర్లలో ఇప్పటివరకు 60 మందికి పైగా ప్రజలు మృతి చెందగా.. వేల సంఖ్యలో యువకులు గాయపడ్డారు.