కేంద్ర వ్యవసాయశాఖ
సాక్షి, హైదరాబాద్: పురుగు మందులతో పండిం చే పంటలన్నీ విషపూరితం అవుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. ‘కొన్ని రకాల పురుగు మందులతో పండించే పంటల వల్ల మానవుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. పర్యావరణం దెబ్బతింటుంది. భూమి, నీరు, గాలి కలుషితం అవుతున్నాయి. ఆయా పంటలు తినే పశు పక్ష్యాదులు, మానవజాతి తీవ్ర ప్రమా దంలో పడింది. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నా యి’అని కేంద్ర వ్యవసాయశాఖ స్వయంగా తేల్చి చెప్పింది. అందుకే 18 రకాల పురుగు మందుల ను నిషేధిస్తూ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖకు తెలియజెప్పింది. అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అమెరికా వంటి దేశాల్లో ఎప్పుడో వీటిని నిషేధించగా.. కేంద్రం ఇప్పుడు మేల్కొంది.
పురుగుమందుల నిషేధపు ఉత్తర్వు–2016
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటి ఫికేషన్ను ‘పురుగుమందుల నిషేధపు ఉత్తర్వు– 2016’గా పిలుస్తారు. వాస్తవంగా దేశంలో ఏ పురుగు మందులు ప్రమాదకరమో నిర్ధారించేం దుకు 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రపంచంలో నిషేధంలో ఉన్న 66 రకాల పురుగు మందులు భారతదేశంలోనూ వినియోగిస్తున్నా రని తేల్చింది. చివరకు ఆ కమిటీ నిషేధించా ల్సిన పురుగు మందు లపై వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. అందులో 18 రకాల పురుగు మందులను నిషేధించాలని నివేదించింది. ఇవి మనుషులు, జం తుజాలానికి తీవ్ర ప్రమాదం (హైరిస్క్) కలిగిస్తా యని పేర్కొంది. అందువల్ల తక్షణమే చర్యలకు విన్నవించింది.
నిషేధించిన 18 రకాల పురుగు మందులివే
► హాబెనోమిల్. ఈ తెగులు మందును పంటలకు మచ్చలు వస్తే వాడుతారు. ఇది చల్లిన పంటను తినే పశుపక్ష్యాదులు, మనుష్యులపై ప్రభావం చూపుతుంది. గర్భిణులకు హాని చేస్తుంది.
► హాకార్బరిల్ పురుగు మందును పంటలకు ఒకసారి వేస్తే దాని ప్రభావం ఆ పంటపై దాదాపు 45 రోజులు ఉంటుంది. కూరగాయల పంటలపై ఈ పురుగు మందును చల్లితే ఎంత కడిగినా అది పోదు. అది మన శరీరాన్ని విషమయం చేస్తుంది.
► హాడయాజినాన్ కూడా పురుగుమందే. ఇది జీవజాతిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
► హాసోడియం సైనేడ్. ఇది సైనేడ్ అంత స్పీడ్గా జీవజాతిని నాశనం చేస్తుంది.
► హాఅలాగే ఫెనారిమోల్, ఫెన్తియాన్, లిను రాన్, ఎంఈఎంసీ, మిత్యాల్ పారతియాన్, తైమి టాన్, త్రైడిమార్ప్, ట్రిఫ్లురాలిన్, అలాక్లోర్, వైచ్ లార్వోస్, పోరేట్, పాస్పమిడాన్, త్రైయా జోఫాస్, త్రైక్లోర్ఫాన్లు ఉన్నాయి.
18 రకాల పురుగు మందులపై నిషేధం
Published Wed, Jan 4 2017 3:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement