కేంద్ర కేబినెట్‌లో మార్పులు | Cabinet Portfolio Changes | Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినెట్‌లో మార్పులు

May 14 2018 9:48 PM | Updated on Oct 22 2018 2:09 PM

Cabinet Portfolio Changes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా పీయూష్ గోయల్‌కు అధనపు బాధ్యతలు అప్పగించారు. మూత్రపిండ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్‌ జైట్లీ కొలుకునే వరకు పీయూష్‌ గోయల్‌ ఆర్థిక శాఖ ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆయన రైల్వేశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఎస్‌ఎస్‌ అహ్లువాలియాకు ఎలక్ట్రానిక్స్ & ఐటి శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం సమాచార శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీని తప్పించి.. రాజ్యవర్ధన్ సింగ్‌ రాథోడ్‌కు సమాచార శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇకపై ఆమె జైళీ శాఖ మంత్రిగానే కొనసాగనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement