ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దేశంలో మరో 62 కొత్త జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్వీ)లను ప్రారంభించేందుకు బుధవారం ఆమోదం తెలిపింది.
కాకినాడలో రహదారి మళ్లింపునకు కూడా
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దేశంలో మరో 62 కొత్త జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్వీ)లను ప్రారంభించేందుకు బుధవారం ఆమోదం తెలిపింది. రూ.2,871 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఛత్తీస్గఢ్కు 11, గుజరాత్కు 8, ఢిల్లీకి 7, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్లకు చెరో 5 జేఎన్వీలు దక్కారుు. పల్లెల్లోని ప్రతిభావంతుల కోసం ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కాకినాడలో నౌకాదళానికి చెందిన భూభాగం నుంచి వెళ్తున్న రాష్ట్ర రహదారి(ఎస్హెచ్)-149 మార్గం మళ్లింపునకు కేబినెట్ ఆమోదం లభించింది.
ప్రస్తుతం ఈ దారి విస్తరించి ఉన్న 11.25 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం నుంచి కేంద్రం తీసుకుంది. దీనికి ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త మార్గం నిర్మాణం కోసం 5.23 ఎకరాల భూమిని, రూ. 18.83 కోట్ల డబ్బును పరిహారంగా చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ఈ రహదారిని మళ్లించడం ద్వారా శిక్షణా కార్యక్రమాలను ఏ ఆటంకం లేకుండా నిర్వహిచుకోవచ్చని కేంద్రం తెలిపింది. అలాగే సులభతర వ్యాపార నిర్వహణను ప్రోత్సహించడంతోపాటు సేవలలో పారదర్శకత, నాణ్యతను తీసుకొచ్చేందుకు తోడ్పడే ‘మర్చంట్ షిప్పింగ్ బిల్లు’ను కూడా మంత్రివర్గం ఆమోదించింది.