భళా.. బాలుడి సాహసం | Brave schoolboy averts train accident | Sakshi
Sakshi News home page

భళా.. బాలుడి సాహసం

Mar 17 2015 7:56 PM | Updated on Sep 2 2017 10:59 PM

దవనగిరి: ఆ బాలుడు పేరు సిద్దేశ్.. వయసు తొమ్మిదేళ్లు. చదువుతోంది నాలుగో తరగతి. అయితేనేం, అతడికొచ్చిన ఆరాటం, ఆలోచన మాత్రం చాలా గొప్పది. పెద్దవారు కూడా చేయని సాహసాన్ని చేసి ఓ రైలును భారీ ప్రమాదం నుంచి కాపాడాడు.

దవనగిరి: ఆ బాలుడు పేరు సిద్దేశ్.. వయసు తొమ్మిదేళ్లు. చదువుతోంది నాలుగో తరగతి. అయితేనేం, అతడికొచ్చిన ఆరాటం, ఆలోచన మాత్రం చాలా గొప్పది. పెద్దవారు కూడా చేయని సాహసాన్ని చేసి ఓ రైలును భారీ ప్రమాదం నుంచి కాపాడాడు. అవరగిరిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సిద్దేశ్ వాళ్ల హోటల్ రైల్వే ట్రాక్ పక్కనే ఉంది. అంతకు ముందు ఓ రైలు వెళుతుండగా పెద్ద శబ్దాన్ని గుర్తించిన ఆ బాలుడు ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా రైలు పట్టా ఒకటి విరిగిపోయి కనిపించింది. ఇదే విషయాన్ని పరుగుపరుగున వెళ్లి తండ్రి మంజునాథ్కు చెప్పినా అతడు పెద్దగా పట్టించుకోలేదు. ఈ లోపు ఒక రైలు వస్తుండటంతో ఎంతో సాహసం చేసిన బాలుడు తాను వేసుకున్న ఎర్రటి టీ షర్ట్ను తీసి ధైర్యంగా పట్టాలమీదకు వెళ్లి ఊపేయడంతో రైలును కొద్ది దూరంలో ఆపేశారు. అతడి సాహసాన్ని చూసిన రైల్వే అధికారులు మెచ్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement