
రాజ్యసభ సమావేశాలకు హాజరైన నటి రేఖ
రాజ్యసభకు నామినేటై రెండేళ్లవుతున్నా ఏడుసార్లే సమావేశాలకు హాజరైనందుకు విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రేఖ మంగళవారం సభ సమావేశాలకు హాజరయ్యారు.
న్యూఢిల్లీ: రాజ్యసభకు నామినేటై రెండేళ్లవుతున్నా ఏడుసార్లే సమావేశాలకు హాజరైనందుకు విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రేఖ మంగళవారం సభ సమావేశాలకు హాజరయ్యారు. ఆమె పార్లమెంటు ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఫొటోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టారు. దీంతో వారికి ఆమె నమస్కారం చేసుకుంటూ లోనికి వెళ్లారు.