'ఒక్క రూపాయి వసూలు చేసినా ప్రాణం తీసుకుంటా' | BJP leader threatens suicide over railways' notice | Sakshi
Sakshi News home page

'ఒక్క రూపాయి వసూలు చేసినా ప్రాణం తీసుకుంటా'

Mar 16 2016 12:19 PM | Updated on Mar 28 2019 8:37 PM

'ఒక్క రూపాయి వసూలు చేసినా ప్రాణం తీసుకుంటా' - Sakshi

'ఒక్క రూపాయి వసూలు చేసినా ప్రాణం తీసుకుంటా'

తన వద్ద నుంచి ఒక్క రూపాయి వసూలు చేసినా ఆత్మహత్యకు పాల్పడతానని బీజేపీ నేత ఒకరు బెదిరించారు.

లక్నో: తన వద్ద నుంచి ఒక్క రూపాయి వసూలు చేసినా ఆత్మహత్యకు పాల్పడతానని బీజేపీ నేత ఒకరు బెదిరించారు. 2014లో నరేంద్రమోదీ నిర్వహించిన ర్యాలీకోసం కార్యకర్తలను తీసుకునేందుకు పది కోచ్లను ఇండియన్ రైల్వే నుంచి ఫతేపూర్ సిక్రీకి చెందిన బీజేపీ నేత వినోద్ సమారియా అద్దెకు తీసుకున్నారు. కానీ, ఆ మొత్తం చెల్లించడంలో విఫలమయ్యారు.

ఈ నేపథ్యంలో ఆ డబ్బులు చెల్లించాలని, లేదంటే ఆస్తులు వేలం వేసి వాటిని వసూలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ భారతీయ రైల్వే నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. లక్నోలో మోదీ నిర్వహించిన ర్యాలీ కోసం సమారియా రూ.18,39,560 డిపాజిట్ చేసి పది రైల్వే కోచ్లు అద్దెకు తీసుకున్నారు. దీనికి మొత్తం అద్దె రూ.30,68,950 కాగా డిపాజిట్ మాత్రమే చేసిన సమారియా మిగితావి చెల్లించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement