బిహార్‌ సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం | Bihar CM Nitish Kumar's convoy met with an accident in Supaul | Sakshi
Sakshi News home page

బిహార్‌ సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం

Jun 16 2017 9:10 AM | Updated on Sep 5 2017 1:47 PM

బిహార్‌ సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం

బిహార్‌ సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం

బిహార్‌ ముఖ‍్యమంత్రి నితీష్‌ కుమార్‌ కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది.

పట్నా: బిహార్‌ ముఖ‍్యమంత్రి నితీష్‌ కుమార్‌ కాన్వాయ్‌  ప్రమాదానికి  గురైంది.  ఈ  ప్రమాదంలో ఆరుగులు పోలీసులు గాయపడ్డారు. గురువారం  సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  

పట్నా నుంచి కిషన్‌ గంజ్‌కు వస్తుండగా సుపౌల్‌ వద్ద ఈ యాక్సిడెంట్‌ జరిగింది.  ఎన్‌హెచ్‌-57 పై  ఒక ట్రక్ ను ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పిన వీరి వాహనం హఠాత్తుగా  బోల్తా పడింది. గాయపడిన వారిని హుటాహుటిన దర్భంగా లోని పరాస్‌  ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం  వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement